17 April, 2026 | 10:32 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

భద్రాచలంలో వైభవోపేతంగా సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం

06-04-2025 01:14 PM

భద్రాచలం,(విజయక్రాంతి): శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో వైభవంగా ఆదివారం జగదభిరాముడి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో జరిగిన సీతారాముల కల్యాణ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున  పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు కొండాసురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.