15 April, 2026 | 6:55 PM

ఓటు హక్కు వినియోగించుకున్న శ్రీనుబాబు

18-12-2025 12:00 AM

మంథని, డిసెంబర్ 17(విజయ క్రాంతి): మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం ధన్వాడలో బుధవారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వగ్రామమైన ధన్వాడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు శ్రీను బాబు కృతజ్ఞతలు తెలిపారు.