calender_icon.png 18 December, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్.జి.ఎఫ్. రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు పారమిత విద్యార్థి

18-12-2025 12:00:00 AM

ముకరంపుర, డిసెంబరు 17 (విజయ క్రాంతి) : నగరంలోని  పారమిత ఉన్నత పాఠశాల  విద్యార్థి ఎం.చాణక్యన్  రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు  ఎంపిక అయ్యాడని  పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ తెలిపారు. ఈ నెల 15 న కరీంనగర్ పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో  జిల్లా ఎస్.జి.ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎస్.జి.ఎఫ్ అండర్ 14 బాలుర  బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలలో చాణక్యన్ 32 -34 కిలోల విభాగంలో బంగారు పధకం సాధించి రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యాడు.

హన్మకొండ పట్టణంలోని జె.ఎన్ స్టేడియంలోని బాక్సింగ్ హాల్ లో ఈ నెల 18 నుండి  25 వరకు  నిర్వ హించనున్న 69వ రాష్ట్ర స్థాయి   బాక్సింగ్  చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా  పాఠశాల చైర్మన్ డా. ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రాకేష్, రశ్మిత, అనుకర్ రావు, వినోదరావు, వి.యు. ఎం. ప్రసాద్ ,  హనుమంతరావు. ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవిత ప్రసాద్ సమన్వయకర్త శ్రీనాథ్ విద్యార్థిని, బాక్సింగ్ కోచ్  ఎ రామకృష్ణ ను అభినందించారు.