3 July, 2026 | 5:15 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

ఐవీఐ ప్రోగ్రామ్‌తో స్టార్టప్ వ్యవస్థ బలోపేతం

05-10-2024 01:26 AM

కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి

హైదరాబాద్, అక్టోబర్ 4(విజయక్రాంతి): ఐ వెంచర్ ఇమ్మెర్సివ్(ఐవీఐ) ప్రోగ్రామ్ స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేస్తుందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ఆకాంక్షించారు. శుక్రవారం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ)లో ఆరు నెలల ఐవీఐ ప్రాగ్రామ్‌ను ఆయన ప్రారంభించారు. దీన్ని తొలిసారి ఐఎస్‌బీలో ప్రవేశపెట్టారు.

ఈ నేపథ్యంలో ఐవీఐ కోసం ఏర్పాటు చేసిన తరగతి గదిని కూడా కేంద్రమంత్రి ప్రారంభించారు. అనంతరం జయంత్ చౌదరి మాట్లాడుతూ.. ఈ ప్రోగ్రామ్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆలోచనలను వాస్తవ రూపంలోకి తెస్తుందన్నారు. కార్యక్రమంలో ఐఎస్‌బీ డీన్ ప్రొఫెసర్ మదన్ పిల్లుట్ల, ప్రొఫెసర్ భగవాన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.