ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర డాక్టర్ మట్టా దయానంద్
14-04-2026 12:39 AM
పెనుబల్లి, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): పెనుబల్లి మండలం, కారాయిగూడెం గ్రామంలో ఐకెపి. ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు..
ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, కల్లూరు ఏఎంసి వైస్ చైర్మన్ రాజబోయిన కోటేశ్వరరావు, పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంది వెంకటేశ్వరరావు, కారాయిగూడెం గ్రామ సర్పంచ్ వంకాయలపాటి వెంకటేశ్వరరావు, ఏపిఎం.పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




