17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

అట్టహాసంగా రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు ప్రారంభం

18-10-2025 06:24 PM

రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లాల బాలికలు..

రాజాపూర్: రాష్ట్రస్థాయి 69వ ఎస్ జి ఎఫ్ అండర్ 17 బాలికల వాలీబాల్ టోర్నమెంట్ పోటీలు శనివారం మండలంలోని తిరుమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడా పోటీలలో పాల్గొనేందుకు తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 జట్లు క్రీడా పోటీల్లో పాల్గొన్నాయి. కార్యక్రమంలో భాగంగా బాలానగర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థినులు, రాజాపూర్ కేజీబీవీ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పరేడ్, నృత్య ప్రదర్శనలు అహుతులను ఆకట్టుకున్నాయి.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన 12 మందితో కూడిన రెండు జట్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికైన రెండు జట్లు నవంబర్ 13,14,15 న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగు జాతీయస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటారని ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ శారద బాయి, ఎంఈఓ సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎంఈఓ మంజుల,జనం పల్లి శశికళ రెడ్డి, శేఖర్ గౌడ్, బచ్చిరెడ్డి, యాదయ్య, వెంకటేష్, రామకృష్ణ గౌడ్,సత్యనారాయణ గౌడ్,కృష్ణయ్య,నరేష్,యాదగిరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.