18-10-2025 08:23:44 PM
క్రీడలు విద్యార్థుల జీవితంలో భాగం కావాలి
క్రీడల అభివృద్ధికి ఆధునిక మైదానాలు, అత్యాధునిక వసతులు
ఇక ప్రతి ఏటా జిల్లా, రాష్ట్ర, జాతీయ క్రీడలకు ఆతిథ్యం అందిస్తాం
పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి..
అండర్-14 కబడ్డీ బాలికల విభాగంలో...
మహబూబ్ నగర్ జిల్లాకు ప్రథమ స్థానం
ఖమ్మం జిల్లాకు రెండవ స్థానం,
నల్గొండ జిల్లాకు మూడవ స్థానం,
వరంగల్ జిల్లాకు నాలుగవ స్థానం
అండర్-14 కబడ్డీ బాలుర విభాగంలో...
ప్రథమ స్థానం మెదక్ జిల్లా
ద్వితీయ స్థానం నల్గొండ జిల్లా
మూడవ స్థానం రంగారెడ్డి జిల్లా
4వ స్థానం మహబూబ్ నగర్ జిల్లా
అండర్-17 వాలీబాల్ బాలుర విభాగంలో...
ప్రథమ స్థానం ఖమ్మం జిల్లా
ద్వితీయ స్థానం వరంగల్ జిల్లా
తృతీయ స్థానం రంగారెడ్డి జిల్లా
నాల్గవ స్థానం మహబూబ్ నగర్ జిల్లా
పటాన్ చెరు: క్రీడలకు, క్రీడాకారులకు కేంద్రంగా పటాన్ చెరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నామని.. రాబోయే రోజుల్లో రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. గత మూడు రోజులుగా పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానం వేదికగా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో నిర్వహిస్తున్న 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 బాలుర, బాలికల కబడ్డీ మరియు అండర్ 17 బాలుర వాలీబాల్ విభాగం రాష్ట్ర స్థాయి పోటీలు శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ముగిసాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి క్రీడాకారు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వాలీబాల్ జాతీయ స్థాయి క్రీడాకారుడు కృష్ణంరాజుతోపాటు రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులను ఎమ్మెల్యే జిఎంఆర్ ఘనంగా సన్మానించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. సమిష్టి కృషితో రాష్ట్రస్థాయి క్రీడలను విజయవంతం చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గంలోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి పూర్తి సహకారం అందిస్తున్నామని తెలిపారు. జాతీయ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాసాని వీరేష్ మాట్లాడుతూ.... క్రీడల పట్ల ఆసక్తి కలిగిన ఎమ్మెల్యే లభించడం పటాన్ చెరు నియోజకవర్గ ప్రజల అదృష్టం అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గంలో క్రీడలకు సంపూర్ణ మద్దతు అందిస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ ను అభినందించారు. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి కబడ్డీ జట్టులో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యం పెరగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
కబడ్డీ అసోసియేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి జగదీష్ యాదవ్ మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభినందనీయుడు అన్నారు. కబడ్డీ క్రీడలో జాతీయస్థాయిలో మెదక్ జిల్లా క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే రోజుల్లో పటాన్చెరు నియోజకవర్గం నుండి కబడ్డీ క్రీడాకారులు సైతం జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక కావాలని అభిలాషించారు.
శనివారం సాయంత్రం వేలాదిమంది అభిమానుల మధ్య జరిగిన అండర్ 14 బాలుర కబడ్డీ ఫైనల్ మ్యాచ్ లో నల్లగొండ జిల్లా జట్టుపై మెదక్ జట్టు ఘన విజయం సాధించింది.. అండర్ 14 బాలికల కబడ్డీ ఫైనల్ మ్యాచ్ లో మహబూబ్ నగర్ జిల్లా జట్టు పైన ఖమ్మం జిల్లా జట్టు పైన ఘన విజయం సాధించింది. అండర్ 17 బాలుర వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ లో వరంగల్ జిల్లా జట్టు పైన ఖమ్మం జిల్లా జట్టు ఘన విజయం సాధించింది.
ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, పటాన్ చెరు డిఎస్పి ప్రభాకర్, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, మాజీ కార్పొరేటర్ సపనా దేవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మైత్రి క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, ఎంఈవోలు పీపీరాథోడ్, నాగేశ్వర్ నాయక్, సిఐలు వినాయక రెడ్డి, లాలునాయక్, గౌసుద్దీన్, పుర ప్రముఖులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.