29-05-2025 08:57:24 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఐదు రోజుల వృత్యంతర శిక్షణలో భాగంగా గురువారం రోజు ఎస్సీఈఆర్టీ రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ బోచ్కర్ ఓం ప్రకాశ్(SCERT State Examiner Dr. Bochkar Omprakash) సందర్శించారు. ఈయన మాట్లాడుతూ... నైపుణ్యాభివృద్ధిని సాధించి ఉత్తమ బోధనతో ఉపాధ్యాయులు మారుతున్న బోధనా పద్ధతులను ఆకలింపు చేసుకుని సాంకేతిక విద్యతో ముందుకు సాగాలి అన్నారు.
తెలుగు పద్యం విద్యార్థుల ఏకాగ్రతకు సృజనాత్మకతకు దోహదపడుతుందని అవధాన విద్య తెలుగు భాషకే వన్నె తెచ్చిందన్నారు 1000 సంవత్సరాలు అనేక ప్రక్రియలు పద్యం నిలిచిందని చెప్పారు పద్యంలో కావ్యాలు శతకాలు కండకావ్యాలు రామాయణ భారత భాగవతాలు వచ్చాయని గుర్తు చేశారు నాటి ప్రాచీకవులు పద్యమే ప్రాణంగా భావించారన్నారు. బాషోపాధ్యాయులు పద్యాలు తాము నేర్చుకుంటూ విద్యార్థులకు నేర్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ నర్సయ్య కోర్సు డైరెక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి డిఆర్పీలు కొండూరు పోతన చిన్నన్న సాయన్న గంగాధర్ పాల్గొన్నారు.