calender_icon.png 30 May, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దెయ్యాలను పోషించిన చరిత్ర బీఆర్ఎస్ నేత కేసీఆర్ దే

29-05-2025 09:00:15 PM

దెయ్యాల లీడర్ కేసీఆర్..

రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు..

కామారెడ్డి (విజయక్రాంతి): గతంలో పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ దెయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్(KCR) అని దెయ్యాల లీడర్ కేసీఆర్ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కింగ్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసిఆర్ అప్పుల ఊబిలోకి పెట్టినట్టారని అప్పులకు ప్రతినెల కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీతో కడుతుందన్నారు. అయినా ప్రభుత్వ పథకాలను ఆపకుండా నిరంతరంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

నెలకు  6,500 కోట్లు అప్పులు కడుతున్నామని తెలిపారు. అయినా కూడా సంక్షేమ పథకాలను ఆపడం లేదని తెలిపారు. రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పులోబిలోకి నెట్టారని ఆ అప్పులకు ప్రతినెల వడ్డీతో కడుతున్నామన్నారు. ప్రభుత్వ పథకాల నాపకుండా నిరంతరంగా అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ లో దెయ్యాలను పెంచి పోషించింది కేసీఆర్ అని కేసిఆర్ కూతురు కవిత చెప్పిన దాంట్లో అబద్ధం ఏమి లేదన్నారు. వాదంపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధు చేపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని అన్నారు. అమెరికా మాట విని మధ్యలోనే ఆపరేషన్ ఇందులో ఆపడం సరికాదని తెలిపారు. నాడు ఇందిరాగాంధీ ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపిందని యుద్ధమాపడానికి అమెరికా రాయబారం చేస్తే అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారని గుర్తు చేశారు.

కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించే ప్యాకేజీ 22 పండ్లకు ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. సేకరణ నిధులు కోసం ఇరిగేషన్ మంత్రిని షబ్బీర్ అని కలిసి విన్నవించారని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు గెలుపు దిశగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను 70 నుంచి 80% సీట్లు కైవసం చేసు కునేల కార్యకర్తలు నాయకులు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను గడపగడపకు వెళ్లి వివరించాలన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశ సత్యనారాయణ గౌడ్, నిర్వహించార్జ్ వేణుగోపాల్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, మాజీ సి డి సి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, కామారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీ రాజా గౌడ్, భిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, మాజీ జెడ్పిటిసిలు తిరుమల గౌడ్, మాజీ జెడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి, మాజీ ఎన్ డిసిసిబి చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి,కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు  గుడుగుల శ్రీనివాస్, భిక్కనూరు మాజీ ఎంపీపీ బైండ్ల సుదర్శన్, మాజీ సర్పంచ్ బైండ్ల దశరథం, నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షు లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.