29-05-2025 08:50:45 PM
డిప్యూటీ సీఈవో శిరీష..
మునగాల: రైతులకు న్యాయమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని మండల ప్రత్యేక అధికారి డిప్యూటీ సీఈవో శిరీష(Mandal Special Officer Deputy CEO Sirisha) అన్నారు. గురువారం ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, వ్యవసాయ అధికారి బి.రాజుతో పాటు కలిసి మండల కేంద్రంలోని విత్తన దుకాణాలలోని విత్తనాలను పరిశీలించి శిరీష మాట్లాడుతూ... మండలంలోని రైతులందరికీ నాణ్యమైన విత్తనాల అమ్మాలని, సమయానికి అనుగుణంగా విత్తన కొరత రాకుండా విత్తనాలను అందుబాటులో ఉంచాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనాలను వాటి ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ రేటుకు అమ్మకూడదని తెలియజేశారు. లైసెన్స్ కలిగిన డీలర్ వద్ద నుంచి, బిల్ తీసుకొని మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని తెలియజేశారు. పక్క రాష్ట్రాల నుంచి విత్తనాలు తీసుకొవద్దు అని, నకిలీ విత్తనాలు, లూజు విత్తనాలు అమ్మే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులను సూచించారు. ఈ కార్యక్రమంలో రాజేష్, చలసాని ప్రసాద్, విజయ్ పాల్గొన్నారు.