18-06-2025 01:07:41 AM
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): గోసంరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, దీనిలో భాగంగా తొలిదశలో రాష్ట్రంలోని నాలుగుప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశా లలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. గోసంరక్షణకు తీసుకోవాల్సిన సమగ్ర విధానాలపై మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో పశు సంవ ర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావుతో కూడిన కమిటీతో సీఎం భేటీ అయ్యారు.
గోసంర క్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై లోతైన అధ్యయనం చేయాలని సూచించారు. భక్తులు గోవులను దే వతలని భావిస్తారని, వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకుని గోసం రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులు గోశా లలకు ఏటా పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని, కానీ, స్థలాభావంతోపాటు అనారోగ్యసమస్యల కారణంగా గోవులు మృత్యువాత పడుతున్నాయన్నారు.
గోవుల సంరక్షణార్థం అత్యాధునిక వసతులతో గోశాలలను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులు కోడె మొక్కులు చెల్లించే వేములవాడ, యాదగిరి గుట్ట, ఎనికేపల్లి సమీపంలో అత్యవసరంగా గోశాలలు నిర్మించాలని సూ చించారు. వేములవాడ సమీపంలో వంద ఎకరాల స్థలంలో గోశాల నిర్మించాలన్నారు.
గో సంరక్షణ విషయంలో రాష్ట్రప్రభుత్వం రాజీపడ దని, ఖర్చు విషయంలోనూ వెనుకాడదని స్పష్టం చేశారు. అనంతరం ఉన్నతాధికారులు గోశాలల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్ పత్రా లను సీఎంకు అందజేశారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సీఎం ముఖ్యకార్యదర్శులు వీ శేషాద్రి, శ్రీనివాసరాజు, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశు సంవర్ధక శాఖ డైరక్టర్ గోపి, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి పాల్గొన్నారు.