18-06-2025 01:11:11 AM
ఐదేళ్లలో 3.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తాం
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్), జూన్ 17 (విజయక్రాంతి): ఐదేళ్లలో రూ.3 లక్షల 50 వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చుచేయబోతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెల్లోనే రూ.21 వేల కోట్లు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో జమ చేశామని అన్నారు. రాష్ట్రంలోని 1.49 కోట్ల ఎకరాలకు రైతుభరోసా సాయం 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతుల ఖాతాలో వేస్తామని చెప్పారు.
ఇది చరిత్ర అని, దేశంలోని మిగతా ఏ రాష్ట్రంలో జరగలేదని కేవలం తెలంగాణ ప్రభుత్వంలోనే జరుగుతోందన్నారు. గత ఏడాది కాలంలో రైతుల సంక్షేమం రూ.70 వేల కోట్లు తమ ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీల కోసం ఇందిర మ్మ ఆత్మీయ భరోసా కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు అందజేస్తు న్నట్టు చెప్పారు.
ఆర్థికంగా ఎన్నో అవరోధాలు వస్తున్నా సంక్షేమ, అభివృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. మంగళవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి భట్టి విక్రమార్క జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం చెన్నా పూర్ గ్రామంలో సబ్ స్టేషన్ను ప్రారంభించారు. మంజూరునగర్, నవాబు పేట, ధర్మారావుపేట గ్రామాల్లో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స భలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మా ట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుం డా సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షే మ పథకాలు తీసుకురాబోతున్నట్లు తెలిపా రు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు.
రూ 22,500 కోట్లు ఖర్చు చేసి 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించబోతున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంపై బీఆర్ ఎస్ అసత్య ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆ ర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామ ని చెప్పి, కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. తాము అధికారంలోకి రాగా నే సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి గ్రూప్ 1 పరీక్షను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు.
ఏడాదిన్నర కాలంలో 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, కొద్ది రోజుల్లో మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని వెల్లడించారు. యు వతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు తొ మ్మిది వేల కోట్లతో రాజీవ్ యువ వికా సం స్వయం ఉపాధి పథకాన్ని తీసుకువచ్చామన్నారు. ప్రజాప్రభుత్వం రెండు లక్షల రుణ మాఫీని మొదటి ఏడాదిలోనే చేసిందన్నారు.
రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కు టుంబాలకు ఒక్కొక్కరికి ప్రతి నెల 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామ ని పేర్కొన్నారు. ఈ ఏడాది 21 వేల కోట్ల రూ పాయలను వడ్డీ లేని రుణంగా అందించామని, రాబోవు నాలుగేళ్లలో లక్ష కోట్ల రూపా యల వడ్డీ లేని రుణాన్ని మహిళలకు అందజేస్తామన్నారు. 10 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడంతో పాటు గతంలో ఉన్న 90 లక్షల కు టుంబాలకు 13, 525 కోట్ల రూపాయలతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు.
కోతల్లేని కరెంటు సరఫరా
రాష్ట్రంలో గత ఏడాది 15 వేల మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా, ఈ ఏడాది 17,160 మెగావాట్లకు డిమాండ్ పెరిగినప్పటికీ కరెంటు కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేసినట్లు ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని దుష్ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. 29 లక్షల పంపుసెట్లకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వడంతో పాటు, గృహజ్యోతి పథకంలో 200 యూనిట్ల చొ ప్పున నిరుపేదలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. అలాగే విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా పథకాన్ని అమలు చేశామని గుర్తు చేశారు.
ఎందుకూ పనికిరాని కాలేశ్వరం
రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే కాలేశ్వరం ప్రాజెక్టును రూ.లక్షా38 వేల కోట్లకు పెంచి ఎందుకూ పనికి రాకుండా చేశారని ఉపముఖ్యమంత్రి విమర్శించారు. సొంత తెలివితేటలు ఉపయోగించి ప్రజాధనాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి పబ్బం గడుపుకున్నారని బీఆర్ఎస్ను విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన శ్రీ రాంసాగర్, ఎల్లంపల్లి, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు ఒక్కటి కూడా ఇప్పటివరకు చెక్కుచెదరలేదని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు
నీటి వాటా కోసం పోరాటం చేస్తున్నాం: మంత్రి శ్రీధర్బాబు
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఉపాధి కల్పన, 6 గ్యారంటీ పథకాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ప్రారంభంతో ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ప్రజాదరణ తట్టుకోలేక విపక్షాలు ప్రజలను తప్పుడు ఆరోపణలతో తప్పుదోవపట్టించే విధంగా ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు.
బనకచర్ల ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, మూడు నెలల క్రితమే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రికి ఆంధ్రప్రదేశ్ వైఖరిని తెలియజేయడంతోపాటు, కృష్ణ గోదావరి బేసిన్ ట్రిబ్యునల్ ఎదుట తమ వాటా నీటి కోసం గట్టిగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో గోదావరి, కృష్ణానది జలాలను ఎగువన ఉన్న మహారాష్ట్ర, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్కు మేలు చేసే విధంగా ప్రవర్తించారని విమర్శించారు. భూపాలపల్లి జిల్లా చెంతనే కాలేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఒక చుక్క నీరు అందించలేక గత పాలకులు చతికిలపడ్డారని విమర్శించారు.
మహిళలకు మహాలక్ష్మి పథకంలో ఉచితంగా బస్సుల్లో ప్రయాణాన్ని అమలు చేస్తే ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని, మహిళలతో పెద్ద సమావేశం నిర్వహించి, విపక్షాలు చేస్తున్న విమర్శలు, బస్సు ఎందుకనే అభిప్రాయాన్ని వారిముందే పెట్టి తుది నిర్ణయం వారినే అడుగుదామని ప్రకటించారు.
మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి సౌరశక్తి వినియోగం పెంచడానికి, వారిని భాగస్వామ్యం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు.