15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి ‘బద్దం’

30-01-2026 12:00 AM

భిక్కనూర్, జనవరి 29 (విజయ క్రాంతి):  భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ముద్రకోల భార్య-భర్తలు బాలరాజు, మంజుల మెదక్ జిల్లాలో మంగళవారం జరిగిన ఘోర రోడుప్రమా దంలో  మృతిచెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు ముద్ర కోల అభిలాష్ తీవ్రంగా గాయపడి కామారెడ్డి మెడికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషాదానికి స్పందిస్తూ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని అభిలాష్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. డాక్టర్లను సంప్రదించి, గాయపడ్డ వ్యక్తికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలన్న సూచనలు చేశారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇంద్రకరణ్ రెడ్డి, కుటుంబానికి అన్ని సందర్భాలలో మద్దతుగా ఉంటానని భరోసా ఇచ్చారు.