03-06-2025 12:25:35 AM
- అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2 (విజయ క్రాంతి); కొట్లాడు తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ కోటి కాంతులతో విరాజల్లుతోందని, అభివృద్ధి సంక్షేమ పథకాలతో దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ జౌళి శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం తె లంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, కలెక్టర్ జితేష్ వి బాటిల్, ఎస్పీ రోహిత్ రాజులతో కలిసి అమరవీల స్థూపం వద్ద పుష్పగుచ్చం ముంచి ని వాళులర్పించారు.
ప్రగతి మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌర వం స్వీకరించారు. అనంతరం మంత్రి జిల్లా ప్రజలను ఉద్దేశించి, జిల్లాలో, రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై త న సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమం లో భాగంగా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం రవాణా శాఖ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పశుసంవర్ధక శాఖ, అగ్నిమాపక శాఖ మరియు వైద్యశాఖ లు చేపడుతున్న పలు కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన శకటాలు ప్రదర్శించా రు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వి ద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
నాణ్యమైన విత్తనం - రైతన్నకు నేస్తం, విత్తు కొద్దీ పంట అనే నినాదంతో రైతులకు విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి మొ దలుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులకు వివిధ రకాల విత్తనాలను అందజేశారు. సమరయోధుల ను మంత్రి సన్మానిం చారు. వివిధ శాఖల వారు చేపడుతున్న కా ర్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో పదకొండు ఏ ళ్ళు నిండాయి.
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరుపుకుంటున్న, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు శుభాభినందనలు తె లిపారు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులందరికీ ఘనంగా నివాళులు అర్పించారు. ఎందరెందరో అమ ర వీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో దశదిశలా వెలుగులు విరజిమ్ముతుందనీ, దేశం లో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పుకునేందుకు గర్వ పడుతున్నానన్నారు.
ఈ సం దర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమ కారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పా లుపంచుకున్న చిన్నా పెద్దలందరి కీ... పేరు పేరునా ప్రణామాలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థా యిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వం లో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ తో ప్ర జా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తె లంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డా క్యుమెంట్ ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి అయోగ్ సమావేశంలో వెల్లడిం చారన్నారు.
ఆర్థిక భారాన్ని మోస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం, జూన్ 2 (విజయక్రాంతి): గత పాలకులు రాష్ట్రంపై మోపిన ఆర్థిక భారా న్ని మోస్తూ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చే నేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
సోమవారం సా యంత్రం నగరంలోని శ్రీభక్త రామదాసు క ళాక్షేత్రం నందు నిర్వహించిన ఖమ్మం నియోజకవర్గ స్థాయి రాష్ట్ర అవతరణ దినోత్సవ వే డుకల కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ప్రజాప్రతినిధులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రా రంభించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరా వు ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వీడియో రూపంలో ప్రదర్శించారు. ఖమ్మం నియోజకవర్గం వార్షిక నివేదికను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, డి ప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్ర , మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ షఫీ ఉల్లా, డిప్యూ టీ సీఈవో నాగపద్మజ, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2 (విజయ క్రాంతి) ప్రాణ త్యాగాలతో, సబ్బండ వర్గాల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రా ష్ట్రం సమగ్రంగా అభివృద్ధి సాధించి, నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్ అమలైనప్పుడే తెలంగాణ ప్రజలు ఆశించిన తెలంగా ణ సాకారం అవుతుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కా ర్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
11వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యా లయంలో, బస్టాండు సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద జాతీయ జెండాను ఎగుర వేసి, తెలంగాణ ఉద్యమ అమరులకు నివాళులర్పించారు, సిపిఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్బంగా జరిగిన సభల్లో కూ నంనేని మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి తొలి, మలి దశ ఉద్యమానికి కొత్తగూడెం ప్రాంతమే నాంది పలికిందని, ఇక్కడ ప్రారంభమైన ఉద్యమం ప్రతిఒక్కరిలో స్ఫూ ర్తిని నింపి రాష్ట్ర సాధనకు బాటలు వేసిందన్నారు.
కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా కార్యద ర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ స భ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దమ్మాలపాటి శేషయ్య, వాసిరెడ్డి మురళి, కందుల భాస్కర్, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, రత్నకుమారి, ధనలక్ష్మి, ఎస్ కె ఫహీమ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
చర్ల , జూన్ 2 (విజయక్రాంతి): స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సీని యర్ నాయకుడు పోలిన రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం చర్ల టౌన్ లో జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్ మాజీ ఎంపీపీ గీద కోదండరామయ్య ,బీసీ సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు ఎస్సీ సెల్ అధ్యక్షులు కోం భతిని రాము మండల మహిళా ఉపాధ్యక్షురాలు సౌజన్య మండల యూత్ అధ్యక్ష కార్య దర్శులు అంబోజీ సతీష్ కుప్పాల నిరంజన్ పార్టీ సీనియర్ నాయకులు పోలిన రామచంద్రరావు దొడ్డి సూరిబాబు తోటపల్లి మాధవ రావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
టీజీవో భవన్లో
ఖమ్మం, జూన్ 2 (విజయక్రాంతి): టీజీ వో భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం జిల్లా అధ్యక్షులు, జిల్లా కన్వీనర్ కస్తాల సత్యనారాయణ జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఎంతోమంది త్యాగఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ రాష్ట్ర అధ్యక్షులు మన్యం రమేశ్బాబు హౌస్ బిల్డింగ్ సొసైటీ జిల్లా కార్యదర్శి పీ విజయ్కుమార్, మహిళా అధ్యక్షురాలు జీ. ఉషశ్రీ టీజీఎల్ఏ 475 రాష్ట్ర అధ్యక్షులు కొప్పిశెట్టి సురేశ్, జిల్లా సభ్యులు డాక్టర్ హరీశ్, మోదుగు వెంకటేశ్వర్లు, జల్లే పుష్పరాజ్ గోపాలకృష్ణ, యాకయ్య, రాంబా బు, శ్రీకాంత్, కిరణ్ తదితరులు పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి కీలక భూమిక పోషించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి, డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి, తెలంగాణ తల్లి చిత్రపటాలకు పూలదండలతోని పుష్పాంజలి ఘటించడం జరిగింది.