03-06-2025 12:28:11 AM
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
- 9, 326 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
- భూ భారతి చట్టంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
- పేద ప్రజలకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా
- ఖమ్మం జిల్లాలో నూతనంగా 5,298 కుటుంబాలకు రేషన్ కార్డులు జారీ
- ఇందిరా మహిళా శక్తి కింద మహిళల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు
- మా పాప మా ఇంటి మణీదీపం కార్యక్రమంపై జిల్లా కలెక్టర్కు అభినందన
- రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గోన్న డిప్యూటీ సీఎం
ఖమ్మం , జూన్ 2 (విజయ క్రాంతి): పేదల సంక్షేమం, ప్రజలకు మౌళిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రజా పాలన అంది స్తున్నామని డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ఖ మ్మంలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ఆయన అతిథిగా పాల్గోన్నారు. ముందుగా అమర వీరుల స్థూ పం వద్ద నివాళులర్పించిన అనంతరం పో లీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పోలీసు గౌరవవంద నం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేసి తన సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని, భారత దేశంలోనే, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలి పేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నా యకత్వంలో తెలంగాణ రైజింగ్ -2047 విజ న్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందనీ, పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరి పాలన లక్ష్యా లుగా తెలంగాణ రైజింగ్ -2047 విజన్ పాల సీ రూపోందించా మన్నారు. ఈ లక్ష్యాల సా ధనకు ప్రభుత్వం ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సో షల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇ న్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీలను సిద్ధం చేసిందని అన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ను ప్రక్షాళన చేసి, గ్రూప్ పరీక్షలు విజయ వం తంగా నిర్వహించామని, నిరుద్యోగ యువతకు భవిష్యత్తుపై ఆశలను కల్పిస్తూ ఏడాది కాలంలోనే 55 వేలకు పైగా ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేసి నియామక పత్రాలను అంద జేశామని తెలిపారు. భవిష్యత్తు తరాలకు స్వ చ్ఛమైన పర్యావరణహిత ఇంధనాన్ని అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 20 25 ను రూపొందించిందని, ఇందులో భా గంగా 2030 నాటికి 20 వేల మెగావాట్ల సామర్ధ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మ హాలక్ష్మి తాండవిస్తుందనీ, ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందనీ, దీని ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు మహిళలకు రూ 167. 89 కోట్లు ఆ దా అయ్యాయని అన్నారు. నానాటికి పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారం మహిళలపై పడకుండా గ్యాస్ సిలిండర్ ను సబ్సిడీ పై రూ 500కే ప్రజా ప్రభుత్వం సరఫరా చే స్తుందన్నారు.
గృహ జ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల లోబడి విద్యుత్ వినియోగిస్తున్న ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా విద్యు త్ అందిస్తున్న దని, జిల్లాలో రూ 130.18 కోట్ల సబ్సిడీ చెల్లించి 2, 43, 647 కుటుంబాలు లబ్ది పొందినట్లు తెలిపారు. నిరుపేద లకు ప్రభుత్వం సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశ పెట్టిందని, ఖమ్మం జిల్లాలో 9,326 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసిందని, ఇంటి నిర్మాణ పురోగతి ప్రకారం నాలుగు దశలలో గ్రీన్ ఛానల్ ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు నే రుగా రూ 5 లక్షలు జమ చేస్తుందని డిప్యూ టీ సీఎం తెలిపారు.
ఇందిరా మహిళా శక్తి కా ర్యక్రమం క్రింద మన జిల్లాలో మహిళా మార్ట్, క్యాంటీన్, 64 స్త్రీ టీ షాపులు ఏర్పా టు చేశామన్నారు. మధిర నియోజకవర్గం లో మహిళల ఆర్థిక సాధికారతను పెంచేందుకు ఇందిరామహిళా డెయిరీ ప్రాజెక్ట్ చేప ట్టామన్నారు. ఇందులో భాగంగా 21 వేల మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు రెండు పాడి గేదెలను ఇచ్చి, వారి నుండి పాలు సేకరించి, డెయిరీ ద్వారా ఆ పాలను విక్రయించడం జరుగు తుందని, ఇందిరా మహిళా డెయిరీ ద్వారా వచ్చే లాభాలు కూ డా సంఘ సభ్యులకు జమ చేస్తామని అన్నా రు.
రైతు సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత కల్పించిందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఖ మ్మం జిల్లాలో 1, 31, 760 మంది రైతులకు సంబంధించి రూ 2 రెండు లక్షల వరకు మొత్తం రూ 912.10 కోట్ల రుణ మాఫీ చేశామన్నారు.పెట్టుబడి సహాయాన్నిరూ 12 వేల కు పెంచి ఖమ్మం జిల్లాలో 2 ,89,31 మంది రైతుల ఖాతాలో రూ 259.74 కోట్లు రైతు భరోసా నిధులు జమ చేశా మన్నారు.అకాల వర్షాలకు పంట నష్టపోయిన 28,407 ఎకరాలకు రూ 10 వేల చొప్పున పరిహారం జ మ చేయడం జరిగిందన్నారు. యాసంగి సీజన్ లో 32, 102 మంది రైతుల వద్ద నుం డి 21.66 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసి, 48 గంటలలోగా చెల్లింపులు చేసామని తెలిపారు.
సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ ప్రభుత్వం అందిస్తున్నదని, జిల్లాలో 47,494 మంది రైతులకురూ 136 .33 కో ట్లు బోనస్ అందించామని తెలిపారు. జిల్లా లో ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్న 2118 మంది రైతులకు రూ 21 కోట్ల సబ్సిడీతో 7,801 ఎకరాలలో డ్రిప్ సౌకర్యం కల్పించామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సిపి సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, డిసిసిబి చైర్మ న్ దొండపాటి వెంకటేశ్వరరావు,నగర మే యర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, డి.ఎఫ్. ఓ. సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, జెడ్పీ సి.ఈ.ఓ. దీక్షా రై నా, డి.ఆర్.ఓ. పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాస య్య, జిల్లా అధికారులు, ఖమ్మం ఆర్డీఓ. నరసింహా రావు, సంబంధిత అధికారులు, తె లంగాణ అమరవీరుల కుటుంబాల సభ్యు లు, విద్యార్థిని, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.