21-06-2025 12:56:49 AM
కామారెడ్డి, జూన్ 20,(విజయక్రాంతి): ప్రజలు మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 26 వరకు మాదక ద్రవ్యాలపై (ౄrugs) అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్ శరీరాన్ని మాత్రమే నాశనం చేయదని, కుటుంబాన్ని జీవితాన్నే మార్చేస్తుందని చెప్పారు.