10-06-2025 12:00:00 AM
భద్రాచలం, జూన్ 9 (విజయ క్రాంతి); గిరిజన దర్బార్ లో స్వయం ఉపాధి ద్వారా జీవనోపా ధి పెంపొందించుకోవడానికి మాత్రమే గిరిజనులు దరఖాస్తులు చేసుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగాల కొరకు దరఖాస్తులు స్వీకరించబడవని, దరఖాస్తులు చేసే అర్జీ దారులు వారికి సం బంధించిన పూర్తి డాటా జిరాక్స్ ప్రతులు దరఖాస్తుతో జత చేసి సమర్పించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
సోమవారం ఐ టి డి ఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో యూనిట్ ఆఫీసర్ల సమక్షంలో వివిధ మారుమూల ప్రాంత ఆదివాసి గిరి జన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజనులకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీ సుకోవాలని ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, ఎస్డిసి రవీంద్రనాథ్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హరీష్, ఎస్ఓ భాస్కరన్, ఏవో సున్నం రాంబాబు, ఏపీఓపవర్ వేణు, డిటిఆర్ఓఎఫ్ఆర్ లక్ష్మినారాయణ, ఎఫ్డిసి ఉదయ్ కుమార్, పివిటిజి అధికారి మనిధర్, మేనేజర్ ఆదినారాయణ, ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి, ఇతర శాఖల సిబ్బంది భార్గవి, జోగారావు, చలపతి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.