calender_icon.png 10 June, 2025 | 10:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు

10-06-2025 12:00:00 AM

ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కశిరెడ్డినారాయణరెడ్డి

చారకొండ, జూన్ 9: మండలంలోని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూ రు చేసి ఆదుకుంటామని అచ్చంపేట, కల్వకుర్తి ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కశిరెడ్డినా రాయణరెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన 240 మంది లబ్ధిదారులకు ప్రొసిడింగ్ పత్రాలను ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలందరికి సొంతింటి కళ నేరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంద న్నారు.

ఇండ్లు రాని వారు ఎవ్వరూ ఆందోళన చెందొద్దని, విడతల వారిగా అర్హులందరికి అందుతాయాన్నారు.బైపాస్ బాధితులు ఇంటిస్థలం, ఇండ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి. చారకొండ మండల కేంద్రంలో కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి(167) విస్తరణలో భాగంగా చారకొండ-మర్రిపల్లి వరకు రెండు కిలో మీటర్ల మేర చేపట్టిన బైపాస్ నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని బాధితులు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు విన్నవించారు.

తమ ఇండ్లు కూల్చివేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నా తమకు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలో నిర్మించిన నమూన ఇందిరమ్మ ఇల్లును ఎమ్మెల్యేలు ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మాజీ జెడ్పీవైస్ చైర్మన్ బాలాజీసింగ్, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో ఇసాక్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్ గౌడ్, మండల అధ్యక్షుడు బలరాం గౌ డ్, నేతలు వెంకటయ్య యాదవ్, శంకరయ్య, మహేందర్ సందీప్ రెడ్డి, సురేందర్ రెడ్డి, వెంకటయ్య  పాల్గొన్నారు.