14-06-2025 12:12:23 AM
సంచలన చర్చలకు తెరలేపిన సంఘటన
నల్లగొండ టౌన్, జూన్ 13: నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. కేశరాజు పల్లి వద్ద ఉన్న ట్రాక్ దగ్గర రైలు కిందపడి ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు, నల్లగొండ పోలీసులు సంయుక్తంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో నల్లగొండ జిల్లాలో సంచలన చర్చలకు తెరలేపాయి. స్థానికులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందిన గోశెట్టి నిషాంత్ ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
గత కొన్నేండ్ల క్రితం హైదరాబాద్ లోని మీర్ పేటలో ఓ హిజ్రాతో పరిచయం ఏర్పడి, వివాహం కూడా చేసుకున్నాడు. అనంతరం ఇరువురు స్వగ్రామానికి రాగా, నిశాంక్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే రమేష్, ఆ హిజ్రాకు మధ్య ఘర్షణ ఏర్పడి, మీర్ పేటకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.
అదే సమయంలో దాదాపు వంద మంది హిజ్రాలు, డెడ్ బాడీని తీసుకొచ్చి నిడమనూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేయడంతో నిడమనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఈ మధ్యనే కేసు ఫైనల్ కు వచ్చి కొట్టేశారని బంధువులు పేర్కొన్నారు.
వారం రోజుల క్రితమే మిస్సింగ్..
వారం రోజుల క్రితమే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లాడు మృతుడు. గురువారం సాయంత్రం తల్లిదండ్రులు నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఆటోతో సహా హైదరాబాద్ వెళ్లి ఉంటాడని అనుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన తెల్లారే ఇలా జరగడమేంటని స్థానికులు పేర్కొంటున్నారు.