22 June, 2026 | 1:30 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

చేవెళ్లలో గాలివాన బీభత్సం

18-04-2025 12:16 AM

బీజాపూర్ హైవేపై విరిగి పడ్డ భారీ మర్రి వృక్షం

చేవెళ్ల, ఏప్రిల్ 17: చేవెళ్ల మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది.   ఈదురు గాలులతో కూడిన వర్షం దాటికి చేవెళ్ల మున్సిపాలిటీలోని ఓ ఫ్లెక్సీ విరిగి విద్యుత్ వైర్లపై పడడంతో పాటు బీజాపూర్ హైవేపై మిర్జాగూడ ఖానాపూర్ గ్రామాల మధ్యలో భారీ మర్రి వృక్షం నేలకొరిగింది.

ఈ చెట్టు రోడ్డుపై పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.   పోలీసులు, సంబంధిత అధికారులు స్పందించి చెట్టును రోడ్డుపై నుంచి తొలగించి... ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అంతేకాదు పలు గ్రామాల్లో వరి, మామిడి తోటలతో పాటు ఆరుతడి పంటలకు కూడా నష్టం వాటిల్లింది.