13-06-2025 01:47:16 AM
అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం, జూన్ 12 (విజయక్రాంతి):వ్యాపారులు, కొనుగోలుదారులకు అనుగుణంగా సౌకర్యవంతంగా వీధి వ్యాపారుల ప్రాంగణంను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అ న్నారు. గురువారం ఖమ్మం పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
మార్కెట్ కు కావాల్సిన అదనపు వసతులు, జరుగుతున్న నిర్మాణ పనులపై కలెక్టర్ పలు ఆదేశాలు ఇచ్చారు.కలెక్టర్ మాట్లాడుతూ వీధి వ్యాపారుల ప్రాంగణంలో కొనుగోలుదారుల రద్దీ దృష్ట్యా మరిన్ని వస తులు కల్పించాలని తెలిపారు.
మార్కెట్ బయట ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ను మరొక ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రస్తుతం బయట ఉన్న టాయిలెట్స్ తీసివేసి, రోడ్డు నుంచి మా ర్కెట్ లోపలికి అందంగా ఉండేలా చిన్న ఎత్తులో గోడ నిర్మించాలని, ఆ గోడకు గ్రిల్స్ ఏర్పాటు చేసి, పార్కింగ్ సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.పబ్లిక్ టాయిలెట్స్ షిప్టింగ్ పనులు వారం రోజులలో, మరో రెండు వారాలలో గోడ నిర్మాణం పనులు పూర్తిచేయాలని అన్నారు.
వీధి వ్యాపార ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు మార్కెట్ లో ఏ ర్పాటు చేస్తున్న షెడ్ ల నిర్మాణం, మార్కెట్ లోపల స్త్రీ, పురుషులకు వేరు వేరుగా నిర్మిస్తున్న టా యిలెట్ నిర్మాణ పనుల పురోగతిని మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళా వ్యాపారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. మార్కెట్ లో ఉన్న వ్యాపారస్తులకు చిన్న, చిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా ఆర్థిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట మునిసిపల్ అసిస్టెంట్ కమీషనర్ షఫీ ఉల్లా, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.