13-06-2025 01:45:14 AM
ఇల్లెందు టౌన్,జూన్ 12 (విజయక్రాంతి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం మొదటి విడతలో భాగంగా నేడు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులకు చెందిన లబ్ధిదారుల ఇంటి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలకు ఇల్లందు ఎమ్మెల్యేకోరం కనకయ్య గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్దిదారులు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇంటినిర్మాణం చేపట్టాలని, నియోజకవర్గ వ్యాప్తంగా గతంలోనూ, ఇప్పుడు తన హయాంలోనే నిరుపేదలకు పక్కా గృహాలు మంజూరు కావడం నా పూర్వజన్మ సుకృతంగ భావిస్తున్నానని, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు ప్రక్రియ చేపట్టడం ద్వారా నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు అందాయని అన్నారు.
24వార్డుల్లో పెద్దయెత్తున స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డీ.ఈ, ఏ.ఈ ,మున్సిపల్ మాజీ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ శ్రీకాంత్, డీ.ఈ మురళీ, ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, సీఐ.బత్తుల సత్యనారాయణ, ఎస్.ఐ శ్రీనివాస్ రెడ్డి,
పట్టణ అధ్యక్షుడు దొడ్డా డానియెల్, జనరల్ సెక్రటరీ మొహ్మద్ జాఫర్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసం లక్ష్మణ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, 24 వార్డులకు చెందిన వార్డు అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పట్టణ, మండల సీనియర్ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.