15 June, 2026 | 3:02 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

వరదగట్లను పటిష్ఠం చేయండి

21-07-2024 12:00 AM

నిన్నటివరకు వర్షాభావంతో అల్లాడిన తెలంగాణకు ఇప్పుడు వరదల ప్రమాదం ముంచుకొచ్చింది. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో గత నాలుగైదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఏజన్సీ జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావు పేట పెద్ద వాగుకు గండి పడడంతో వందలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. వరద నీరు గ్రామాల్లోకి చొచ్చుకు రావడంతో ప్రజలు ఎత్తయిన ప్రదేశాలు, చెట్లపైన రాత్రంతా  తలదాచుకోవలసి వచ్చిందని వార్తలు వచ్చాయి. గత కొంతకాలంగా చెరువులు, వాగుల గట్ల పటిష్ఠత గురించి పట్టించుకోకపోవడంతో అవి బలహీనమై తెగిపోతున్నాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో వర్షాలు మరింత ఎక్కువ కురిసే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదులకు వరద వస్తే పరిస్థితి దారుణంగా ఉండే ప్రమాదం ఉంది. ఆస్తినష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరగవచ్చు. కనుక అధికారులు ఇప్పుడే మేల్కొని, అన్ని నదులు, వాగులు, చెరువు గట్లను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోవాలి.

  రాములు నాయక్, మణుగూరు