11-06-2025 12:00:00 AM
-మారుమూల అటవీ ప్రాంతంలో బుల్లెట్పై ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యటన
అదిలాబాద్, జూన్ 10(విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రజలలో మమేకమై ప్రజలకు అత్యంత చేరువై పోలీ సు సేవలను అందించడానికి నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజ న్ అన్నారు. బీంపూర్ మండలంలోని మారుమూల గ్రామాలైన గుబిడి, టెకిడి రాంపూర్, కరంజీ, భగవాన్పూర్ గ్రామాల్లో మంగళవారం ఎస్పీ సందర్శించి ‘పోలీసు మీకోసం‘ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇలాంటి వాహనాలు వెళ్ళలేని అత్యంత మారుమూల అటవీ ప్రాంతం లోని భగవాన్పూర్కు డీఎస్పీ జీవన్ రెడ్డితో కలిసి బుల్లెట్పై ఎస్పీ స్వయంగా వాహనా న్ని నడుపుతూ గ్రామానికి చేరుకున్నారు. సుమారు 7 కిలోమీటర్ల మేర బుల్లెట్ పైనే ఎస్పీ ప్రయాణించారు. ఈ సందర్భంగా గ్రా మస్తులతో ఎస్పీ మాట్లాడుతూ... యువతకు కల్పించిన ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఊరు పేరు, కీర్తి ప్రతిష్టలను పెం పొందించాలని సూచించారు. అదేవిధంగా గ్రామాలలో ఎలాంటి గంజాయిని పండించకూడదని సేవించకూడదని తెలిపారు.
చట్ట వ్యతిరేకంగా గంజాయిని పండించిన వారిపై కేసులో నమోదు చేస్తూ ప్రభుత్వ పథకాలు రాకుండా జిల్లా యంత్రాంగానికి సిఫార్సు చేయబడుతుందని హెచ్చరించారు. నిరుద్యోగ యువతీ, యువకులకు త్వరలోనే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాబ్ మేళాను నిర్వహించడం జరుగుతుందని, ఎక్కువ సం ఖ్యలో యువత పాల్గొని ఉద్యోగాలు సాధిం చి వచ్చిన ప్రదేశంలో ఉద్యోగాల నిర్వహించాలని సూచించారు.
అదేవిధంగా యువత క్రీడారంగంలోనూ అభివృద్ధి చెందాలని నాలుగు గ్రామాలలో వాలీబాల్ కిట్లు క్రికెట్ కిట్లను అందజేసి క్రీడారంగం లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. చిన్నపిల్లలకు చదువు ఒక ప్రాధాన్యతను తెలియజేసి ప్రతి ఒక్కరూ చదువుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలిపారు.
మహారాష్ట్రకు అనుకోని ఉన్నందున ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, ఎలాంటి సమాచారం అయినా ప్రత్యేకంగా నిర్వహించబడుతున్న 8712659973 అనే నెంబర్ కు వాట్సప్ ద్వారా తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యం గా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సిఐ సాయినాథ్, బీంపూర్ ఎస్త్స్ర పీర్ సింగ్ నాయక్, గ్రామ పెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.