11-06-2025 12:00:00 AM
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న క్రిటికల్ కేర్ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే పాయల్
అదిలాబాద్, జూన్ 10 (విజయక్రాంతి ): జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న క్రిటికల్ కేర్ ఆస్పత్రిని మంగళవా రం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 23 కోట్ల నిధుల వ్యయంతో ఆస్పత్రిని నిర్మించడం జరిగింద ని, నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. కార్పొరేట్కు దీటుగా ఆసుపత్రిని నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నా రు.
జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, క్రిటికల్ కేర్ ఆస్పత్రి అందించిన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి, దానికి సహకరిస్తున్న సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపా రు. త్వరలో క్రిటికల్ కేర్ ఆస్పత్రి ప్రారంభించడానికి కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రుల తో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల ప్రవీణ్, కృష్ణ యాదవ్, భరత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.