11-06-2025 12:00:00 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జూన్ 10 (విజయకాంతి): జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పను లను చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించా రు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మం దిరంలో రెవెన్యూ, అటవీ, విద్యుత్, ఆర్ అం డ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మారుమూల గిరిజన, అటవీ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, విద్యు త్ వంటి మౌలిక వసతుల కల్పన కోసం శాఖలు అటవీశాఖకు ప్రపోజల్స్ పంపించాలని సూచించారు. అభివృద్ధి పనులకు అ టవీశాఖ నుంచి ముందస్తు అనుమతులు పొందాల్సిన అవసరం ఉందని, ప్రతి శాఖ పరస్పర సమన్వయంతో కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు.
విద్యుత్ లైన్ల ఏర్పాటుకు పరివేష్ పోర్టల్ ద్వారా అనుమతులు పొందాలని అధికారులకు స్పష్టం గా తెలిపారు. చపట్టే అభివృద్ధి కార్యక్రమా లు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన మార్గదర్శకాలను ఇతర శాఖలకు అటవీశాఖ వేగంగా పంపించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, జిల్లా అటవీ అధికారి నాగిని భాను, ఆర్డీఓ రత్నాకళ్యాణి, సంబంధిత శాఖల ఇంజినీరింగ్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.