calender_icon.png 15 July, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి,ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు

14-07-2025 12:00:00 AM

రాజన్న సిరిసిల్ల:జూలై 12(విజయక్రాంతి): జిల్లాలో అక్రమ మట్టి మరియు ఇసుక చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడ రూరల్ మండలంలోని కొడి ముంజ అనుపురం గ్రామ పరిసరాల్లో అక్రమ రవాణా చేస్తున్న పది మట్టి త్రవ్వే యంత్రాలు వాహనాలను వేములవాడ ఇంచార్జి ఆర్డిఓ రాధాబాయి ఆదివారం సాయంత్రం సీజ్ చేశారు.

ఇందిరమ్మ ఇళ్లకు అని బ్యానర్ తో అక్రమంగా తరలిస్తున్న మట్టి నాలుగు టిప్పర్లు రెండు ట్రాక్టర్లు రెండు జెసిబి లు రెండు హిటాచి యంత్రాలను వేములవాడ ఆర్డిఓ రాధాభాయి సీజ్ చేసి వారి పై కేసులు నమోదు చేశారూ.జిల్లాలో ఎవరు అనుమతి లేకుండా అక్రమ మట్టి మరియు ఇసుక రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగాహెచ్చరించారు.