23-06-2025 05:11:11 PM
హెల్మెట్ ధరించని వారికి జరిమాన, వాహనాలు సీజ్..
ఎస్సై ఇనిగాల వెంకటేష్..
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలోని సోమవారం ములుగు జిల్లా ఎస్పీ శబరిష్(District SP Shabarish) అదేశాల మేరకు స్థానిక ఎస్సై ఇనిగాల వెంకటేష్ ఆద్వర్యంలో అభయమిత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటేష్ మాట్లాడుతూ... అభయమిత్ర పోలిస్ అంటే ప్రజలకు, సహాయం చేయడానికి వారిలో, భద్రత భావాన్ని పెంపొందించడానికి పోలీసులు రూపొందించిన ఒక కార్యక్రమమని మత్తుపదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం, పోలిసులు కృత నిశ్చయంతో పనిచేస్తున్నారని, మాదకద్రవ్యాల వల్ల అనర్థాలు జరుగుతాయని, విలువైన జీవితం, ఆరోగ్యం కోల్పోతరాని, సామాజిక జీవితంపై, ఆర్థిక పరిస్థితులపై భారీ నష్టాలు జరిగే అవకాశం ఉందని, అలాగే వాహనలు నడుపుతూ హెల్మెట్ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, సోమవారం నాడు నాలుగు ద్విచక్ర వాహనాలకు 24 వందల రూ. జరిమానా విధించడం జరిగిందని తెలిపారు.