21-06-2025 03:05:12 PM
ప్రజలకు నిరంతరం భద్రత కల్పించడమే తమ లక్ష్యం
రామగిరి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరణ లో ఎస్ఐ తాడవేన శ్రీనివాస్
రామగిరి, (విజయక్రాంతి): శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రజలకు నిరంతరం భద్రత కల్పించడమే తమ లక్ష్యమని రామగిరి ఎస్ఐ తాడవేన శ్రీనివాస్(Ramagiri SI Tadavena Srinivas) అన్నారు. శనివారం రామగిరి ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలో రాత్రి పగలు పోలీస్ పెట్రోలింగ్ పెంచి, ప్రజలకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజల సహకారంతో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా విధులు నిర్వహిస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ శ్రీనివాస్ ను స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.