calender_icon.png 21 June, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడి వచ్చే... రైతుల్లో భరోసా నింపే

21-06-2025 03:02:30 PM

122102 మంది రైతుల ఖాతాల్లో రూ : 190.54 కోట్లు జమ 

హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు 

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): వానకాలం పంటల సాగుకు(monsoon crops) రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో పెట్టుబడి సాయం జమ చేస్తుంది. వర్షాకాలం పంటకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించడం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన వేల ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో వ్యవసాయానికి ప్రభుత్వ అందించిన డబ్బులు ఎంతో ఉపయోగపడతాయని రైతుల పేర్కొంటున్నారు. జిల్లాలో దాదాపుగా 4 లక్షలకు పైగా ఎకరాల  ఖరీఫ్ లో పత్తి, కంది, పెసర, వరి ,సోయాబీన్ తదితర పంటలను రైతులు సాగు చేస్తుంటారు.జిల్లా వ్యాప్తంగా 143063 రైతులు ఉండగా వారికి 266.86 కోట్ల నిధులు పెట్టుబడి సహాయం చేయాల్సి ఉండగా ప్రభుత్వం శుక్ర వరకు  ఐదు ఎకరాల లోపు ఉన్న 122102 మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం కింద   రూ : 190.54 కోట్ల నగదును ప్రభుత్వం  జమ చేసింది.