11-06-2025 12:59:23 AM
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, జూన్ 10 (విజయ క్రాంతి): గర్భస్థ స్త్రీ, శిశు మరణాలను తగ్గించాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, వైద్య చికిత్స నిమిత్తం వచ్చే వారికి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.
కలెక్టరేట్ ఎన్ఐసి సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మాతృ మరణాల నివారణపై జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, ఏఎన్ఏం, ఆశ కార్యకర్తలు సంబంధిత సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల వారిగా గర్భిణీ స్త్రీల వివరాలు సేకరించాలని, ప్రభుత్వ సూచనల ప్రకారం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు.
ప్రతి నెల వారికి కావలసిన వైద్య సూచనలు సలహాలు అందిస్తూ హై రిస్క్ కేసులు ఉన్నట్లు అయితే సంబంధిత ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు రిఫర్ చేయాలన్నారు. ఇచ్చే సూచనలు, మందులు వాడుతున్న విషయాన్ని సరి చూసుకోవాలన్నారు. మాతృ మరణాలు జరగకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ ప్రమీల రావు, గూడూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరిండెంట్ డాక్టర్ వీరన్న, హెచ్ ఓ డి, గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీవిద్య, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సారంగపాణి, డాక్టర్ సుధీర్ రెడ్డి, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శ్రవణ్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు సురేష్, మౌనిక, జ్వేలిత, విరాజిత, ప్రవీణ్, రామకృష్ణ, అనిల్, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సూపర్వైజర్లు, ఏఎన్ఏంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.