11-06-2025 12:59:12 AM
మూడురోజులుగా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హుటాహుటిన ఢిల్లీకి మంత్రి ఉత్తమ్, డిప్యూటీ సీఎం భట్టికీ పిలుపు
హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీతో భేటీ అయ్యారు. మలి దశ మంత్రివర్గ విస్తరణ జరిగిన నేపథ్యంలో పార్టీ పెద్దలు.. ఎవరెవరికి? ఏయే శాఖలు కట్టబెట్టాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు. మంత్రివర్గంలో భారీగా మార్పులు, చేర్పులు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
అందుకే సీఎం మరో రెండురోజులు ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి పిలుపు రాగా ఆయన హుటా హుటిన ఢిల్లీకి పయన మయ్యారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టికి కూడా పిలుపు వచ్చింది. సాధారణంగా మంత్రివర్గ విస్త రణ జరిగి, కొత్త మంత్రులు ప్రమాణస్వీ కారం చేసిన రోజు, లేదంటే మరుసటి రోజు శాఖల కేటాయింపు జరుగుతుంది.
తెలంగాణలో మాత్రం మంత్రివర్గ విస్తరణ జరిగి, కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమా ణస్వీకారం చేసినప్పటికీ, వారికి శాఖల కేటాయింపు జరగలేదు. అలాగే మంత్రిత్వశాఖల్లో భారీగా మార్పులు, చేర్పులు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్రెడ్డి సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్తో గంటపాటు భేటీ అయ్యారు.
భేటీలో కొత్త మంత్రులు అడ్లూరి లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, వివేక్కు శాఖల కేటాయింపు, ప్రస్తుతం కొందరు మంత్రుల శాఖల్లో మార్పులతో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవలపై చర్చించారు. సీఎం అలాగే ఎస్సీ వర్గీకరణ, బీసీ కుల గణనకు సంబంధించిన కృతజ్ఞతా సభలను మెదక్, సూర్యాపేటలో నిర్వహించాలనే ప్రతిపాదన పెట్టినట్లు, సభలకు రాహుల్గాంధీ, మల్లిఖార్జున ఖర్గేను ఆహ్వానించినట్లు తెలిసింది.
అందుకు సంబంధిం చిన తేదీలను ఖరారు చేయాలని వేణుగోపాల్ను కోరినట్లు సమాచారం. అలాగే మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న మూడు బెర్తులను కూడా భర్తీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేసినట్లు బోగట్టా. మరోవైపు ఖర్గే, రాహుల్గాంధీ 11 ఏళ్ల మోదీ పాలనా వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని సీఎంకు సూచించారు.
సీఎం వద్ద ఉన్న కీలక శాఖలు సీనియర్లకు..
ప్రస్తుతం హోంశాఖ, విద్య, మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, గనులు, కార్మిక శాఖ, వాణిజ్యపన్నులు, న్యాయశాఖ.. ఇలా పదిశాఖలకు పైగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిధిలోనే ఉన్నాయి. వీటిలో వద్ద ఉన్న మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖను మరో మంత్రికి అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలు కీలక మంత్రిత్వశాఖలు నిర్వహిస్తున్న వారి వ్యవహారశైలి, పనితీరు అంశాలపై సీఎంను ఆరా తీసినట్లు సమాచారం.
కీలకశాఖలు నిర్వహిస్తున్న మంత్రులకు అప్పగించినశాఖల్లో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తున్నది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన గడ్డం వివేక్ తనకు విద్యుత్ లేదా విద్యాశాఖ అప్పగించాలని కోరుతున్నట్లు సమాచారం. ఇదే ఆకాంక్షను తాను ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎదుట కూడా వెలిబుచ్చినట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం విద్యా శాఖ సీఎం పరిధిలో, విద్యుత్ శాఖ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క పరిధిలో ఉన్నది. పార్టీ పెద్దలు వివేక్కు కార్మిక, మైనింగ్, క్రీడలశాఖలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయమైన సమాచారం. అలాగే సీఎం వద్ద ఉన్న హోంశాఖను సీనియర్లకు అప్పగిస్తారని తెలిసింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు పలువురు హోంశాఖను ఆశిస్తున్నట్లు ప్రచారంలో ఉంది.
అలాగే డిప్యూటీ సీఎం వద్ద ఉన్న ఆర్థిక శాఖను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు అప్పగిస్తారని, కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, మరో కొత్తమంత్రి వాకిటి శ్రీహరికి పశు సంవవర్థక, యువజన, న్యాయ లేదా మత్స్యశాఖ కేటాయించే అవకాశం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
అందిన నివేదికల ప్రకారమే..
మంత్రి పదవులు ఇవ్వడమే కాదు, శాఖల కేటాయింపుల్లోనూ అధిష్ఠానం సామాజిక న్యాయం పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. కీలకమైన శాఖలు ఒకే సామాజికవర్గానికి చెందిన వారికి కాకుండా, అన్ని వర్గాలకు సమానంగా అప్పగించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు కొందరు మంత్రులపై కొందరు ఇప్పటికే అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు.
అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో అనేకసార్లు భేటీ అయి మంత్రుల పనితీరుపై నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆ నివేదిక అధిష్ఠానానికి అందజేశారని, దీని ప్రకారం పనితీరు బాగాలేని మంత్రులకు అప్రాధాన్య శాఖలు కట్టబెట్టే అవకాశం ఉందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి.
అలాగే కొందరు మంత్రులు రెండు, మూడు కీలక శాఖలు నిర్వహిస్తున్నారని, వారిపై పనిభారం పడుతున్నదని, ఆయాశాఖలపై సమీక్షలు, పర్యవేక్షణ కొరవడటంతో మంచి ఫలితాలు రావడం లేదనే అభిప్రాయం పార్టీలో కొన్నివర్గాల్లో ఉంది.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇటీవల ఢిల్లీలో సీఎంతో పాటు మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలిచ్చారు. సీఎం రేవంత్రెడ్డి సైతం ప్రభుత్వ పాలన వ్యవహారాలు, మంత్రుల వ్యవహారశైలి, పనితీరుపై ఒక నివేదిక ఇచ్చారు. వీటన్నింటి నేపథ్యంలో మంత్రుల్లో ఎవరికి.. ఏ శాఖ దక్కుందనే అంశంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.