27-05-2025 12:00:00 AM
మణుగూరు, మే 26 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి పీవీ కాలనీ ఏరియాలో చోరీల నియంత్రణకు సింగరేణి యాజమాన్యం, పోలీస్ శాఖ సంయుక్తంగా పటిష్టమైన చర్యలు చేపట్టారు. గత కొంతకాలంగా పీవీ వరుస చోరీలు చోటు చేసుకోవడంతో కార్మికులకు,వారి కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.
దీంతో కాలనీ వాసులు చోరీల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్, స్థానిక పోలీస్ యంత్రాంగంను కోరారు. దీంతో వారు ప్రత్యేక దృష్టి సారించి బాంబే కాలనీ నుంచి పీవీ కాలనీ మీదుగా అంబేద్కర్ పార్క్, సి టైప్ వరకు సుమారు 50 కి పైగా నిఘా నేత్రాలను సోమవారం ఏర్పాటు చేశారు. సింగరేణి యాజమాన్యం ప్రత్యేక సిబ్బందిని నియమించి స్కై మిషన్ ద్వారా ఒక్కక్కోటిగా నిశితంగా పరిశీలించారు..
ప్రతి సి సి కెమెరా మనుగడలో ఉండే విధంగా పటిష్టమైన చర్యలు చేపట్టారు. కాలనీ ఏరియా తో పాటు మణుగూరు పట్టణం లో రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడుతున్న వారి ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా సబ్ ఇన్ స్పెక్టర్ ను నియమించి పెట్రోలింగ్ ముమ్మరం చేయడం, సింగరేణి యాజమాన్యం రాత్రి సమయాల్లో ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బంది నీ నియమించి గస్తీ పెంచడం జరిగింది.
సింగరేణి ,పోలీస్ శాఖల ఏర్పాట్ల పట్ల కాలనీ వాసులు హర్షం వ్యక్తం వేస్తున్నారు.. కాలనీ ఏరియా లో జరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు కాలనీ వాసుల రక్షణ కొరకై పీవీ కాలనీ సింగరేణి హాస్పిటల్ ఎదురుగా గతంలో పోలీస్ శాఖ వారు ప్రత్యేకంగా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని దానిని తిరిగి పున ప్రారంభం చేయాలని ప్రస్తుత డి యస్. పి రవీందర్ రెడ్డి నీ స్వయంగా కలసి టి బి జి కె యస్ వైస్ ప్రెసిడెంట్ నాగల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. చోరీలను అరికట్టేందుకు సింగరేణి , పోలీస్ యంత్రాంగాలు తీసుకుంటున్న చర్యలు పట్ల కార్మిక పక్షాన ఆయన ధన్యవాదాలు తెలిపారు.