27-05-2025 12:00:00 AM
చౌటుప్పల్, మే 26(విజయక్రాంతి): చౌటుప్పల్ మండల కేంద్రంలోని కొయ్యలగూడెం గ్రామంలో 15 రోజుల వ్యవధిలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడంతో అనాధలైన ఇద్దరు చిన్నారులు.
మే 13వ తారీకు ఆడపడుచు, అత్తమామల, భర్త వేధింపులు తట్టుకోలేక పాయిజన్ తీసుకొని గోశిక నవ్య చనిపోవడంతో చౌటుప్పల్ పోలీసులు భర్త గోశిక భాస్కర్ పై కేసు నమోదు చేయడంతో రిమాండ్ కు తరలించే ఉండగా భార్య దశదినకర్మ తర్వాత వస్తానని తెలిపిన భర్త గోశిక భాస్కర్ భార్య నవ్య దశదిన కర్మ అయిపోయిన తర్వాత తను కూడా చేనేత వస్త్రాల కు అదే తేజ నూల్ కలరను సేవించి మరణించాడు. దీంతో వీరి క్షణిక ఆవేశానికి 10 సంవత్సరాల బాబు, ఐదు సంవత్సరాల పాప అనాధలయ్యారు .దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.