27-05-2025 12:00:00 AM
హుజూర్నగర్, మే 26 : హుజూర్ నగర్ పట్టణ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొడ్డు గోవిందరావు ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని బీసీ భవన్ లో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ బొడ్డు గోవిందరావు బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షులుగా పనిచేస్తూ సమర్థవంతమైన నాయకుడు గుర్తింపు పొందారున్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.అలాగే బీసీ సంక్షేమ సంఘం 27వ వార్డు ఇన్చార్జిగా శెట్టి శ్రీనివాస్ ని నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం హుజూర్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు ధూళిపాల శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు గడ్డం అంజి యాదవ్, పట్టణ మహిళా అధ్యక్షురాలు గూడెపు దీప, పట్టణ ప్రధాన కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లు, పట్టణ ఉపాధ్యక్షులు చేపూరి నరసింహ చారి, కర్నే కృష్ణ, 14 వ వార్డు ఇంచార్జ్ బండి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.