18-06-2025 12:00:00 AM
జహీరాబాద్, జూన్ 17 :ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జహీరాబాద్ పట్టణంలో జరిగింది. జహీరాబాద్ ఎస్ఐ వినయ్కుమార్ తెలిపిన వివరా ల ప్రకారం...జహీరాబాద్ పట్టణానికి చెంది న రాయిపల్లి కృష్ణ కుమారుడు వెంకటరమణ(19) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివాడు. సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల కావడంతో ఫెయిల్ అయ్యాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. వెంకటరమణ తల్లి ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో అతని స్నేహితులు ఇంటికి వెళ్లి చూడగా ఉరి వేసుకున్న దృశ్యాన్ని చూసి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లు వెంకటరమణ మృతి చెందినట్లు ధ్రువీకరించారు. తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.