calender_icon.png 18 June, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటు పాఠశాలల దోపిడీ కనిపించడం లేదా..!

18-06-2025 12:00:00 AM

మిర్యాలగూడ, జూన్ 17 : ప్రైవేటు పాఠశాలల దోపిడీ అధికారులకు ప్రజాప్రతినిధులకు అగుపడటం లేదా అని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరు మలగిరి అశోక్ ప్రశ్నించారు. మంగళవారం మిర్యాలగూడలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎదుట బీసీ సంఘం నాయకులతో కలిసి కండ్లకు నల్ల బ్యాడ్జీలను ధరిం చి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మిర్యాలగూడలోని ప్రైవే టు పాఠశాలల ఫీజుల దోపిడీ బహిరంగంగా జరుగుతున్నప్పటికీ అధికారులు ప్ర జాప్రతినిధులు కండ్లు మూసుకొని కాలం వెళ్లవచ్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత కాంగ్రెస్ విద్యాశాఖ యంత్రాంగానికి ఫీజుల గోడు కనిపించట్లేదా లేక ప్రైవేటు వి ద్యాసంస్థల తోటి కుమ్మక్కై పేద మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా అణగదొక్కే ప్ర యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అజయ్ గంగాధర్ ఇంద్ర శంకర్ రమేష్ సైదులు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.