26-06-2025 12:06:43 AM
ఎస్పీ శరత్ చంద్ర పవార్
నల్లగొండ టౌన్, జూన్ 25 : యువత మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరు యాంటీ డ్రగ్ సోల్జర్గా పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాలలో భాగంగా బుధవారం నల్గొండ పట్టణంలోని చిన్న వెంకట్ రెడ్డి పంక్షన్ హాల్లో మాదక ద్రవ్యాలను తీసుకోవడం వల్ల జరిగే నష్టాల పై వివిధ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు.
యువత తమ శక్తియుక్తులను డ్రగ్స్ మాయలో పడి వృథా చేసుకోకూడదని, ఒక్కసారి డ్రగ్స్ వాడితే అది మెల్లమెల్లగా వ్యసనంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సంతోషం కొరకు సేవించడం అలవాటుగా పడి డ్రగ్స్ బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు.
డ్రగ్స్ మీద పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని, డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉండడంతో పాటు, తమ దృష్టికి నిషేధిత డ్రగ్స్ సరఫరా మరియు వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని తక్షణమే తెలియజేయాలని సూచించారు. నిషేధిత డ్రగ్స్ వాడకం వలన అనేక నేరాలకు పాల్పడుతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు.
డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత యాంటీ డ్రగ్ సోల్జర్గా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, టూ టౌన్ సిఐ రాఘవరావు, వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, టౌన్ ఎస్త్స్ర సైదులు, వివిధ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.