స్కూల్లో ర్యాగింగ్.. ఐదుగురు విద్యార్థుల అరెస్ట్
కేరళ: ప్రభుత్వ సహాయంతో పనిచేసే హయ్యర్ సెకండరీ స్కూల్లో ర్యాగింగ్(Ragging)లో భాగంగా జూనియర్ విద్యార్థిపై దాడి చేసినందుకు ముగ్గురు ప్లస్ టూ విద్యార్థులను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఫిబ్రవరి 12న సీనియర్లను గౌరవించకపోవడం, వారి 'ఆదేశాలను' పాటించకపోవడం వల్ల ఐదుగురు విద్యార్థులు(Students) జూనియర్పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఐదుగురు విద్యార్థులపై దాడి ఆరోపణలపై కేసు నమోదు చేశామని, వారిలో ముగ్గురిని అరెస్టు చేశామని కొలవల్లూరు పోలీసులు తెలిపారు. పాఠశాల అధికారులు ఫిర్యాదు చేసిన తర్వాత కేరళ ర్యాగింగ్ నిషేధ చట్టం(Kerala Prohibition of Ragging Act)లోని సెక్షన్ల కింద పోలీసులు అభియోగాలు మోపారని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
పాఠశాలలో ప్లస్ వన్ విద్యార్థి(Plus one student)గా ఉన్న 17 ఏళ్ల బాలుడు చేతికి గాయమై ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై పాఠశాల అధికారులు విచారణ ప్రారంభించిన తర్వాత నిందితులను సస్పెండ్ చేశారు. కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల(Govt Nursing College)లో జూనియర్ విద్యార్థిపై జరిగిన దారుణమైన ర్యాగింగ్కు సంబంధించి ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేసిన ఒక రోజు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.




