calender_icon.png 15 June, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల దుస్తులు ఉపాధ్యాయులకు అందజేత

11-06-2025 12:03:33 AM

సదాశివనగర్, జూన్ 10(విజయక్రాంతి), ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఏకరూప దుస్తువులను మంగళవారం ఉపాధ్యాయులకు అందజేశారు. మండలంలోని పద్మాజీవాడి గ్రామంలో జిల్లా పరిషత్ పాఠాశాల ప్రధాని పాధ్యయునికి దుస్తువులను మండల అధికారులు అందజేశారు.

మండలంలోని అన్ని పాఠశాలలకు సకాలంలో దుస్తులు అందజేయడం జరుగుతుందని మండల విద్యాధికారి యూసఫ్ తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్, ఎంపీడీవో సంతోష్ కుమార్, ఏపిఎం రాజిరెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, గ్రామ సంఘ అధ్యక్షురాలు ధనలక్ష్మి,కళావతి సిసి, సిఏ లు పాల్గొన్నారు.