11-06-2025 12:04:05 AM
తాడ్వాయి, జూన్, 10( విజయ క్రాంతి ): మధ్యాహ్న భోజనం వండేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంఈఓ రామస్వామి తెలిపారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల ప్రారంభం నుంచి మధ్యాహ్నం భోజనం వండేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మంచినీళ్లతో మాత్రమే బియ్యాన్ని కడగాలని కోరారు కూరగాయలను మంచినీళ్ళతో కడిగి వండాలన్నారు తాజా కూరగాయలు మాత్రమే ఉపయోగించాలని సూచించారు చేతులను శుభ్రంగా కడుక్కోవాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సంగారెడ్డి, కళ్యాణి,శ్రావణి తదితరులు పాల్గొన్నారు