calender_icon.png 27 June, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు

27-06-2025 01:28:27 AM

లీగల్ సర్వీసెస్ జిల్లా కార్యదర్శి, న్యాయమూర్తి యువ రాజా 

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్26(విజయక్రాంతి): తప్పుడు దారిలో వెళ్లి విద్యార్థు లు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని లీగ ల్ సర్వీసెస్ జిల్లా కార్యదర్శి, న్యాయమూర్తి యువ రాజా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భం గా విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి యువరాజు మాట్లాడుతూ.. విద్యార్థి దశలో కొంతమంది పిల్లలు తప్పుదారిని ఎంచుకుంటున్నారని తద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. డ్రగ్స్‌లో అనేక రకా లు ఉన్నాయని గంజాయి, కొకైన్, హెరాయి న్, మద్యం, సిగరెట్, గుట్కా ఇలాంటి వాటికి యువత అలవాటు పడి పూర్తిగా నిర్వీర్యం అవుతుందని తెలిపారు.విద్యార్థులు డ్రగ్స్ వల్ల కలిగే అనార్థాలను తెలుసుకోవాలని సూచించారు.

లీగల్ సెల్ సర్వీసెస్ ఆధ్వర్యం లో ఉచిత న్యాయ సాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ అండ్ డిఫెన్స్ కన్వీనర్ అంజలి దేవి,ప్రిన్సిపాల్ యాదగిరి వైస్ ప్రిన్సిపాలు రహీం ,సంతోష్ ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్, చంద్రశేఖర్, రాజకుమార్ ,ఉదయ్ కిరణ్, మహేష్, సంతోష్ పాల్గొన్నారు.