27-06-2025 01:28:43 AM
హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణపై డిమాండ్ పెరుగుతున్నది. అయితే బీసీలకు 42 రిజర్వేషన్ల అమలు డిమాండ్ కారణంగా ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది.
వాస్తవానికి ఎన్నికల నిర్వహణకు ఇతర సమస్యలేమీ లేకున్నా రిజర్వేష న్ తేలకుండా నిర్వహించడానికి వీల్లేదని బీసీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తె లిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీల రిజ ర్వేషన్ల తేల్చే దిశగా రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటికే కులగణన చేపట్టి, బిల్లు చే సి కేంద్ర ప్రభు త్వ ఆమోదానికి పంపింది.
అయితే కేంద్ర ప్ర భుత్వం ఆమోదం లభించక ముందే సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికల ను పూర్తి చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం తో ఎన్నికల నిర్వహణపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు విధించిన గడువు లోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడంపై సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై బీసీ వర్గాలు అనుమానా లు వ్యక్తం చేస్తున్నాయి.
దాటవేత ధోరణి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ అమలు అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై బీసీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కోసం కులగణన చే యడం, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చేతులు దు లుపుకొన్నదని బీసీలు ఆరోపిస్తున్నారు. బీసీల కు రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్ల అంశంలో అఖి లపక్షాలను కూడగట్టడంలో నిర్లక్ష్యంగా వ్య వహరిస్తున్నదని బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తీరు ఇలా ఉండగా కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం భిన్నంగా వ్యవహరిస్తున్నది. బీసీల రిజర్వేషన్లపై అభ్యంతరం లేదంటూనే బిల్లుకు ఆమోదం తెలపడంలో జాప్యం చేయడంపై బీసీలు మండిపడుతున్నారు.
రిజర్వేషన్ల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాటవేత ధోరణిని అవలంభిస్తు న్నారని ఆరోపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చట్టబద్ధతపై బీసీల డిమాండ్..
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు చేసింది. అయినప్పటికీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపని పక్షంలో పార్టీ తరఫున బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నిర్ణయంతో ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్లను ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది.
సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ తోపాటు బీజేపీ, బీఆర్ఎస్ నిర్ణయం ఏవిధంగా ఉన్నా దాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేమని బీసీలు చెబుతున్నారు. తమకు కావాల్సింది రాజకీయంగా ఒక్కసారి ఎన్నికల్లో సీట్లు కేటాయించడం మాత్రమే కాదని, రాజ్యాంగబద్ధంగా బీసీల 42 శాతం రిజర్వేషన్ అమలుకు చట్టబద్ధత కావాలని డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీలో బిల్లు చేసినట్టుగానే పార్లమెంట్లోనూ చట్ట సవరణ చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తున్నారు. బీసీల రిజర్వేషన్ అమలులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
జీవో ఇవ్వాలి
బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చే యాలి. హైకోర్టుగానీ, సుప్రీం కోర్టుగానీ జీవోను కొట్టేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయకుండా తప్పుడు ప్రచారం చేస్తుంది. బీసీల రిజర్వేషన్ అంశంపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాలతో మాట్లాడలేదు. దీని పై అందరి అభిప్రాయం తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్ర ప్రభు త్వానికి సమస్య ఉంటే కేంద్రం నుం చి తప్పకుండా సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానా లు కొట్టేసినప్పుడే కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది.
ఆర్.కృష్ణయ్య,
రాజ్యసభ ఎంపీ
చిత్తశుద్ధి ఉంటే..
బీసీల రిజర్వేషన్ అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు చిత్తశు ద్ధి ప్రదర్శించడం లేదు. వారికి చిత్తశుద్ధి ఉంటే కేవలం 15 రోజుల్లో రిజర్వేషన్లకు ఆమోదం లభిస్తుంది. బిల్లు ఆమోదంపై ఒత్తిడి చేయాల్సిన వారు ఒత్తిడి చేయడం లేదు.. అమలు చేయాల్సిన వారు ఆమోదించడం లేదు. బీసీల రిజర్వేషన్ల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు.
కానీ కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. బీహార్లో జీవో చేస్తే పాట్నా హైకోర్టు కొట్టేసింది. అందుకే చట్ట సవరణ ఒక్కటే రిజర్వేషన్ అమలుకు పరిష్కారం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తలచుకుంటే కోర్టు గడువులోగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
జాజుల శ్రీనివాస్గౌడ్,
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు