ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి
04-04-2026 01:25 PM
సర్పంచ్. చింతకుంట్ల మనోజ్.
తుంగతుర్తి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించి, మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం అందిస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.




