27-06-2025 01:58:46 AM
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
తంగళ్ళపల్లి:జూన్ - 26(విజయక్రాంతి) జిల్లాలోని విద్యార్థులతో చదవ డం పై నిత్యం అభ్యాసన చేయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గురువారం తంగళ్ళపల్లి మండలం మండెపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పా ఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అంగన్వాడీలో చిన్నారులకు సం బంధించిన అన్ని వివరాల రిజిస్టర్ లు సక్రమంగా నిర్వహిస్తూ, పౌష్టికాహారం అం దించాలని ఆదేశించారు.పాఠ్య పుస్తకాలను చదివించి, విద్యార్థుల సామర్థ్యాలను, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న తీరును , వంటకాలని పరిశీలించారు.తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు గణితం, భౌతిక శాస్త్రం బోధించి, ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు.అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. గ్యాస్ సిలిండర్ మీద వంట తయారు చేయాలని, మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం తయారు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు చదవడం బాగా ప్రాక్టీస్ చేయించాలని సూచించారు.