27-06-2025 01:58:56 AM
గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, జూన్ 26 :విజయక్రాంతి) : సీసీ రోడ్ నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురా వాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ. పావని వినయ్ కుమార్ అధికారులను కోరారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ జరుగుతున్న సిసి రోడ్ నిర్మాణ పనులను కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అధికారులు, బీజేపీ నాయకులతో కలిసి పర్యవేక్షించారు.
ఈ సందర్భం గా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లు గా ప్రతి వర్షాకాలంలో వరదముంపుకు గురవుతున్న అరుంధతి నగర్ బస్తి వాసుల ఫిర్యాదు మేరకు వారికి శాశ్వత పరిష్కారం అందించడంలో భాగంగా నూతన రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించామన్నారు.
రాబోయే బోనాల పండుగ లోపు బస్తీలో పనులు పూర్తి చేయాలని, పండుగ నిర్వహించుకునే బస్తి వాసులకు ఎలాంటి ఇబ్బందు లు ఎదురవకుండా బోనాల పండుగ లోపు త్వరగతిన పనులు పూర్తి చేయాలని జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ఇం జనీర్ అబ్దుల్ సలామ్, వర్క్ ఇన్స్పెక్టర్ మ హేష్ కాంట్రాక్టర్లను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏ. వినయ్ కుమార్, బీజేపీ డివిజన్ అద్యక్షుడు వి.నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, దామోదర్, ఎం. ఉమేష్, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.