calender_icon.png 28 June, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

28-06-2025 03:00:27 PM

ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద  లబ్ధిదారునికి రూ. 2 లక్షల 40 వేల చెక్కును అందజేసిన  ఎమ్మెల్యే

చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి నియోజకవర్గం ప్రజలపై తనకు ఉన్న మమకారాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(MLA Medipally Sathyam) మరొకసారి చాటుకున్నారు. గంగాధర మండలం మధురానగర్ గ్రామానికి చెందిన  విశ్వనాథం శ్రీనివాస్  కుమార్తె  అనారోగ్యంతో బాధపడగా ఆసుపత్రిలో చికిత్స చేయించారు. చికిత్స నిమిత్తం  దాదాపు ఆరు లక్షల రూపాయలు ఖర్చయింది. చికిత్స అనంతరం శ్రీనివాస్  ముఖ్యమంత్రి సహాయ నిధి(Chief Minister Relief Fund ) కింద  ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. శ్రీనివాస్ పరిస్థితిని  తెలుసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక శ్రద్ధ వహించి ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద  రూ.2 లక్షల 40 వేల ఆర్థిక సాయం మంజూరు చేయించారు. శుక్రవారం కరీంనగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో శ్రీనివాస్ కు  చెక్కును అందజేశారు. ఆపద సమయంలో తమను ఆదుకున్న ఎమ్మెల్యేని సత్యం కు  శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపాడు.