ప్రయాణం.. నరకప్రాయం

26-04-2024 01:27:22 AM

మేడ్చల్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం, సుఖవంతం అనే సామెత రాతలకే సరిపో తోంది. నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయా ణం ప్రమాదకరంగా మారిందనడానికి ఇదో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆర్టీసీ సంస్థ సరిపడాఓ బస్సులను అవసరమైన రూట్ల లో వేయకపోవడంతోనే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని విద్యార్థులు తెలుపుతున్నారు. నగరశివారు కుత్బుల్లాపూర్ నియో జకవర్గం కొంపల్లి నుంచి దూలపల్లి వెళ్లే చౌరస్తాలో ఓ ఆర్టీసీ బస్సు ఫుట్‌బోర్డుపై విద్యార్థులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఎక్కడైనా ఒక గుంత ఉన్నా, డ్రైవర్ బ్రేక్ వేసినా కింద పడిపోవాల్సిందే. సంబంధిత అధికారులు స్పందిం చి బస్సులను పెంచితే ప్రమాదాలు జరుగకుండా చూడొచ్చని పలువురు అభిప్రా యపడుతున్నారు. అధికారులు స్పందించి సమస్యలకు పరిష్కారం చూపాల్సిఉంది.