కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విశ్వాసం లేదు

26-04-2024 01:25:19 AM

హుజూరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం లేదని, బీఆర్‌ఎస్ హయాంలోనే అన్నివర్గాలకు సమన్యాయం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందని గురువారం ఆయన కందుగుల గ్రామంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పోస్ట్‌కార్డు ఉద్యమం మొదలుపట్టారు. హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉత్తరాలు పోస్ట్ చేశారు. ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేసి గెలిపించాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, నాయకులు రఘుపతిరెడ్డి, సతీష్, మధు, శ్రీధర్ పాల్గొన్నారు.