21-01-2026 07:49:02 PM
నంగునూరు: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్టీయూటీఎస్ మండల శాఖ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి, హెచ్ఎం గొట్టిపర్తి రామస్వామి, ఆంక్షాపూర్ హెచ్ఎం నాగార్జున రెడ్డి పాల్గొని క్యాలెండర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బిక్షపతి మాట్లాడుతూ.. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు న్యాయబద్ధమైన పాత పింఛన్ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కల్లూరి నర్సింలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.